బిగ్ బాస్: ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఆమె..!

-

తెలుగులో బిగ్ బాస్ ఆరో సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 11వ వారానికి చేరిందని చెప్పాలి. గతవారం హౌస్ నుండి డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఇద్దరు కంటెస్టెంట్లు వెళ్లిపోగా.. ప్రస్తుతం హౌస్ లో 10 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇక ప్రతి వారం నామినేషన్ వాడి వేడిగా జరుగుతోందని చెప్పాలి. అయితే మిగతా వారాల కంటే ఈ వారం కాస్త ప్రశాంతంగానే సాగింది
ప్రస్తుతం ఉన్న పదిమంది ఇంటి సభ్యులలో 9 మంది నామినేట్ అయ్యారు. ఫైమా కెప్టెన్ అయిన కారణంగా ఆమెను ఎవరు నామినేట్ చేయలేదు.

రోహిత్, ఇనయా, ఆదిరెడ్డి , కీర్తి, మెరీనా, శ్రీ సత్య, శ్రీహాన్ , రాజశేఖర్, రేవంత్ ఇలా తొమ్మిది మంది నామినేషన్ లోకి చేరిపోయారు. కానీ 11వ వారానికి సంబంధించి నామినేట్ అయిన వాళ్లకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ 9 మంది లక్ష నుంచి ఐదు లక్షల వరకు కోట్ చేయాల్సి ఉంటుందని.. ఎవరైతే మిగిలిన వాళ్ళు రాయని ఎక్కువ మొత్తం పై చెక్ వేస్తారో వాళ్లకి ఇమ్యూనిటీ పవర్ లభిస్తుందని తెలిపాడు. దీంతో రాజ్ గెలిచి సేఫ్ అయ్యాడు. 8 మంది నామినేషన్ లో ఉండిపోయారు.

ఇలాగే రేవంత్ మొదటి స్థానంలో ఉండగా.. ఇనయ రెండవ స్థానంలో ఉంది. శ్రీహన్ మూడో స్థానం కాగా కీర్తిబట్ 4వ స్థానం, రోహిత్ ఐదో స్థానం, ఆదిరెడ్డి ఆరో స్థానం ,మెరీనా ఏడో స్థానంలో ఉన్నారు. ఇక శ్రీ సత్య ఎనిమిదో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం మెరీనా , శ్రీ సత్య ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్న నేపథ్యంలో ఇదే కంటిన్యూ అయితే వీరిద్దరిలో శ్రీ సత్య ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఓటింగ్ లో తేడా వస్తే ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కష్టం.

Read more RELATED
Recommended to you

Latest news