ఇదెక్కడి మాస్ మావా..చలి కాచుకునెందుకు బైక్ ను తగలబెట్టాడు…!

-

ఈ ఏడాది చలి కాస్త ఎక్కువ ఉన్న సంగతి తెలిసిందే. అయితే చలికాచుకునెందుకు ఓ దొంగ ఏకంగా బైక్ నే తగలబెట్టడు.ఈ ఘటన మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…..స్థానిక యశోధర నగర్ లో కొన్ని ద్విచక్రవాహనాలు చోరికి గురయ్యాయి. దాంతో బైకులు పోయాయి అంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగలోకి దిగిన సర్ఫరాజ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం పది బైకులు పోయాయని ఫిర్యాదులు రాగా నిందితుడి వద్ద తొమ్మిది బైకులు దొరికాయి.

దాంతో మరో బైక్ ఎక్కడ అని పోలిసులు ప్రశ్నించగా సర్ఫరాజ్ చెప్పిన సమాధానం చూసి షాక్ అయ్యారు. చలి బాగా ఉండటం తో పడి బైకుల్లో ఒక బైకును తగలబెట్టి చలి కాచుకున్నట్టు చెప్పాడు. దాంతో దొంగ నిజం చెప్పాడా లేదంటే అబద్దం చెబుతున్నాడా అన్నది తెలుసుకోవడానికి పోలీసులు విచారణ మొదలు పెట్టారు. దొంగ నిజంగానే బైకు తో చలి కాలుచుకుంటే పోలీసులు ఏం చేస్తారో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news