గోదావరి ఖనిలో ఘోరం… ఆస్పత్రిలో ఉరేసుకుని బాలింత ఆత్మహత్య

-

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన బాలింత ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రభుత్వాసుత్రిలో బాలింత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. సదరు మహిళ 15 రోజుల క్రితం ఓ బాబుకు జన్మనిచ్చింది. ఏమైదో ఏమో తెలియదు కానీ.. ఈరోజు ఆసుపత్రిలోనే చున్నీతో ఉరేసుకుని ప్రాణం తీసుకుంది.

వివరాల్లోకి వెళితే కమాన్ పూర్ మండలం రొంతికుంటకు చెందిన ఉమ కాన్పు కోసం గోదావరి ఖనిలోని ప్రభుత్వ  ఆసుపత్రిలో చేరింది. రెండు వారాల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటుంది. అయితే ఆదివారం తెల్లవారుజామున ఉమ తన చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారాణ ప్రారంభించారు. ఆత్మహత్యకి కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఆసుపత్రి, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆరోపణలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news