ఇండియాలో కొత్తగా 6987 కరోనా, 422 ఓమిక్రాన్ కేసులు నమోదు

-

ఇండియా లో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..నిన్నటి కంటే ఇవాళ కాస్త తగ్గాయి కరోనా కేసులు.  గడిచిన 24 గంటల్లో దేశంలో 6,987 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 76,766 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.26 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 162 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,79, 682 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7,091 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,42,30,354 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 141.37 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇప్పటి వరకు దేశం లో 422 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news