ప్రారంభానికి ముందే కుప్పకూలిన బిష్ణుపుర్‌ అహోక్‌ ఘాట్‌ బ్రిడ్జి

-

ప్రారంభోత్సవం కూడా కాకముందే ఓ వంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటన బిహార్​లోని బెగూసరాయ్​లోని బుఢీ గండక్​ నదిపై చోటుచేసుకుంది. గోవింద్‌పూర్‌, రాజౌరా వెళ్లే సాహెబ్‌పుర్‌ కమల్‌ బ్లాక్‌లోని బుఢీ గండక్‌ నదిపై నిర్మించిన బిష్ణుపుర్‌ అహోక్‌ ఘాట్‌ వంతెనను ముఖ్యమంత్రి నావార్డ్ యోజన కింద 2017 సంవత్సరంలోనే పూర్తి చేశారు. ఈ వంతెన నిర్మాణాన్ని మా భగవతి నిర్మాణ సంస్థ చేపట్టింది. దీని నిర్మాణానికి రూ.13.43 కోట్లు ఖర్చు చేశారు. కానీ అప్రోచ్ రోడ్డు లేకపోవడం వల్ల.. ఈ వంతెనకు ప్రారంభోత్సవం నిర్వహించలేదు.

ఈ వంతెన కూలిపోయిన సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఓ రోహిత్‌కుమార్‌, ఎస్‌డీపీవో కుమార్‌ వీరేంద్ర, పలువురు అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ వంతెనపై వాహనాల రాకపోకలు లేనందున పెద్ద ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. అయితే, వంతెన నిర్మించిన కాంట్రాక్టర్​ను వెంటనే అరెస్టు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version