కులాల మధ్య బిజెపి చిచ్చు పెడుతోంది – హరీష్ రావు

-

బిజెపి పై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు మంత్రి హరీష్ రావు. బిజెపి సమాధులు తవ్వే ప్రయత్నం చేస్తే.. సీఎం కేసీఆర్ బలమైన పునాదులు తవ్వే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బిజెపి పేదల వద్ద పన్నులు గుంజి ఆదానికి పెడుతుంటే.. కెసిఆర్ సంపద పెంచి పేదలకు పంచుతున్నారని అన్నారు. బిజెపి మసీదులను కూల్చుతుందని.. దీంతో కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుందని ఆరోపించారు.

చతిస్గఢ్ లో కాంగ్రెస్ యాసంగి కొనదు అందుకే రాష్ట్రంలో కొంటున్నామన్నారు. గత ప్రభుత్వాలు పేదల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తే.. నేటి బిఆర్ఎస్ ప్రభుత్వం శుద్ధమైన నీళ్లు తాగిస్తుందన్నారు. తెలంగాణలో నాడు ఉన్న కరెంటు కష్టాలు నేడు లేవన్నారు. కెసిఆర్ నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా బలపరచడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version