సచిన్,సెహ్వాగ్ లా మాది సూపర్ జోడీ…!

-

టీం ఇండియా ఒకప్పటి ఓపెనర్స్ సచిన్-సెహ్వాగ్ లా తాము కూడా సంచలనాలు సృష్టిస్తామంటున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. బీహార్‌లోని బీజేపీ-జేడీయూ జోడీతో ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామన్నారు. సచిన్-సెహ్లాగ్‌ తరహాలోనే తమ రెండు పార్టీలది ‘సూపర్‌హిట్’ జోడీ అని అభివర్ణించారు రాజ్ నాథ్. ఈనెల 28న బీహార్ అసెంబ్లీకి తొలి విడత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో భాగల్‌‌పూర్‌లో జిల్లాలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు.

బీహార్‌లోని సంకీర్ణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిపై ఎవరైనా చర్చించ వచ్చని, కానీ అవినీతిపై నితీష్ కుమార్‌ను మాత్రం ఏ ఒక్కరూ వేలెత్తి చూపించలేరని అన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి-బీజేపీ నేత సుశీల్ మోదీలపై రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు కురిపిచారు. స్థానిక భోజ్‌పురి భాషలో ఆయన మాట్లాడుతూ..’లాంతరు చిట్లింది. కిరోసిన్ కారిపోయింది. ఇప్పుడు ఏమాత్రం పనిచేయడం లేదు’ అని ఆర్జేడీపై చలోక్తులు విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news