టీడీపీని వీడే ఆలోచనలో మాజీ మంత్రి…?

-

ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీని ఇంకా ప్రకటించకపోయినా.. కేంద్ర కమిటీలో చోటు దక్కని నేతలు ఒక్కొక్కరుగా అసంతృప్తి బయట పెడుతున్నారు. ఈ జాబితాలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పీతల సుజాత ముందు వరుసలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో చింతలపూడి టికెట్‌ లభించక.. ఇప్పుడు పార్టీ కమిటీలో చొటుదక్కపోవడంతో తనను మర్చిపోయారనే అభిప్రాయంలో ఉన్నారట. టీడీపీకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఏ మాత్రం గుర్తింపు లేని టీడీపీలో ఉండటం కంటే పార్టీ మారడం మంచిదన్న ఆలోచనలో సుజాత ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ మారాల్సి వస్తే బీజేపీ, వైసీపీలలో ఏది బెటర్‌ అన్న లెక్కలు వేసుకుంటున్నారట మాజీ మంత్రి. ఇంకా జిల్లాలోని ఒకరిద్దరి పరిస్తితి కూడా ఇలాగే ఉన్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news