చంద్రబాబును కేంద్రం అరెస్ట్ చేయదు … బీజేపీ నేత క్లారిటీ !

-

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత మరియు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక సందర్భంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం అన్యాయాలను ప్రశ్నించిన వారిని అరెస్ట్ లు చేస్తూ అక్రమంగా ముందుకు వెళుతోందన్నారు. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేస్తుంది అంటూ తనకు తానే చెప్పుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ నేత సత్య కుమార్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు అనవసరంగా భయపడుతున్నారని కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశాలు లేవని సత్య కుమార్ చెప్పారు. కాసేపటి క్రితమే గుంటూరులో మాట్లాడుతూ, చంద్రబాబు చెప్పిన విధంగా రాష్ట్రంలో అప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వం యొక్క పనితీరును ప్రశ్నించిన వారిని ఇబ్బడి పెడుతున్నారని కామెంట్ చేశారు సత్య కుమార్.

ముఖ్యంగా అభివృద్ధిని పక్కన పెట్టేసి అవినీతిని ప్రధానంగా పెట్టుకుని వెళుతున్నారంటూ సత్య కుమార్ చెప్పడం జరిగింది. ఇక చంద్రబాబు తన సొంత రాష్ట్రము పైనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటూ సత్య కుమార్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news