ఎస్పీలో సీటు లేక‌పోవ‌డం వ‌ల్లే బీజేపీకి : అప‌ర్ణ యాద‌వ్ చేరిక‌పై అఖిలేష్ వ్యాఖ్య‌

-

స‌మాజ్ వాదీ పార్టీలో సీటు ద‌క్క‌క పోవ‌డం వ‌ల్లే.. కొంత మంది బీజేపీలో చేరుతున్నార‌ని ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ అన్నారు. అయితే ఈ రోజు అఖిలేష్ యాద‌వ్ సోద‌రుడి భార్య అప‌ర్ణ యాద‌వ్ బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. దీనిపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ స్పందించారు. బీజేపీ భావాజాలం చాలా ప్ర‌మాదమైంద‌ని అన్నారు. అయితే అలాంటి ప్ర‌మాద‌మైన భావాజాలాన్ని కాకుండా త్వ‌ర‌లోనే ఎస్పీ భావాజాలం లోకి బీజేపీ వ‌స్తుంద‌ని అన్నారు.

అందుకు అప‌ర్ణ యాద‌వ్ కృషి చేస్తారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌మాజ్ వాదీ పార్టీ భావాజాలం ఇత‌ర పార్టీల్లో కూడా ఉండాల‌ని అప‌ర్ణ యాద‌వ్ చేస్తున్న కృషి మ‌ర‌వ‌నిది అని అని వ్యాగ్యం గా అన్నారు. అలాగే త‌మ పార్టీలో సీటు కేటాయించ‌క పోవ‌డంతో కొంత మంది సీటు కోసం ఇత‌ర పార్టీల‌కు వెళ్తున్నార‌ని అన్నారు. అలాంటి వారిని త‌ము ప‌ట్టించుకోమ‌ని అన్నారు. అలాగే ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తమ పార్టీయే విజ‌యం సాధిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news