కేసీఆర్ తీవ్ర నిరాశలో అబద్ధాలు మాట్లాడుతున్నాడు..ఎంపీ అరవింద్ సంచలనం…!

-

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. ఎలక్షన్లలో ఓడిపోయినానని, ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నానని తీవ్ర నిరాశతో కేసీఆర్ SC, ST చట్టం గురించి సీఎం స్థాయి మర్చిపోయి, అబద్దాలు ఆడే నీచమైన స్థాయికి దిగజారాడు అంటూ వ్యాఖ్యానించారు. తీన్మార్ మల్లన్న లొట్టపీసు మాట అన్న కేసులో అధికార బలంతో పోలీసులను అడ్డుపెట్టుకొని బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నాడని అన్నారు.

SC ST అట్రాసిటీ చట్టాన్ని బలోపేతం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అంటూ అరవింద్ చెప్పారు. ఒక జర్నలిస్టును వేధించడానికి అధికార యంత్రాంగాన్నంటినీ తీసుకొని దిగినందుకు కేసీఆర్ సిగ్గుపడాలి అంటూ అరవింద్ వ్యాఖ్యానించారు. తీన్మార్ మల్లన్న భార్య ఒక దళిత మహిళ.. ఆ దళిత మహిళను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అండ ఉండాలని ఆమెని తీసుకుపోయి షా తో భేటీ చేయించా అని అన్నారు. అది దళితుల పట్ల నాకున్న చిత్తశుద్ధి అంటూ అరవింద్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news