కోమటిరెడ్డి బ్రదర్స్ కు బిజెపి ప్రత్యేక ఆహ్వానం..రాజీనామా చేసి రావాలని !

-

కోమటిరెడ్డి బ్రదర్స్ కు బిజెపి ప్రత్యేక ఆహ్వానాలు పంపిస్తోంది. ఇవాళ బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి సోదరులు ఇక ఆలస్యం చెయ్యకుండా బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు గూడూరు నారాయ ణ రెడ్డి. సూడో సెక్యూలరిజం అంతం దశలో ఉందని చెప్పారు.


కోమటిరెడ్డి సోదరులకు రాష్ట్రంలోని 30 నుండి 40 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావితం చెయ్యగల సత్తా ఉందని స్పష్టం చేశారు గూడూరు నారాయణ రెడ్డి. కోమటిరెడ్డి సోదరుల రాక కోసం బీజేపీలో చాలా మంది ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే గెలిపించుకునే సత్తా బీజేపీకి ఉందని స్పష్టం చేశారు గూడూరు నారాయణ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించే సత్తా కూడా తమకే ఉందని బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news