మీ రాజన్న బిడ్డను దీవించండి….ప్రచారానికి బయలుదేరుతున్నా: షర్మిల

-

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రచారం ప్రారంభించి ఇప్పటికే దాదాపు అభ్యర్థులను అభ్యర్థులను కూడా ప్రకటించాయి. తాజాగా ఎన్నికల ప్రచార బరిలోకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దిగుతున్నారు.ఈ క్రమంలోనే గురువారం తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు స్వయంగా షర్మిల ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) లో భావోద్వేగ పోస్టు పెట్టారు.

న్యాయం కోసం పోరాడుతున్న తనకు ప్రజల ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నట్లు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ‘దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక నెరవేర్చేందుకు ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నా. మీ రాజన్న బిడ్డను దీవించాలని ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నా అని తెలిపారు. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నా’ అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news