బిగ్ బ్రేకింగ్ : “ధోనీ” హీరో మృతి..!

-

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ పేరు చెప్తే చాలా మంది గుర్తుపట్టక పోవచ్చు.. కానీ, క్రికెటర్ ధోనీ బయోపిక్ లో హీరో అని చెప్తే మాత్రం ఎవరైనా గుర్తుపడతారు. అంతలా ఈ సినిమా ఆయనకి గుర్తింపు తెచ్చింది. అయితే ప్రస్తుతం ఆయన మృతి చెందినట్లు తెలుస్తుంది. ముంబయిలోని తన నివాసంలో బలవన్మరణం చెందినట్టు గుర్తించారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (34) 1986 జనవరి 21 న పట్నాలో జన్మించారు. పలు టీవి సీరియళ్ళలో కూడా నటించిన ఆయన 2013 లో కై పో చే అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ చివరి చిత్రం చిచ్చోర్. లాక్ డౌన్ నేపథ్యంలో బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు. కొన్నిరోజులుగా అతని పరిస్థితి ఏమీ బాగాలేదని, ఉరేసుకుని చనిపోయినట్టు భావిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే నాలుగు రోజుల క్రితం ఆయన మాజీ మేనేజర్ కూడా ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ రెండు ఆత్మహత్యలకు ఏమన్నా లింకు ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news