సన్నీ లియోనీ ఫ్యాషన్ షో సమీపంలో బాంబ్ బ్లాస్ట్

-

బాలీవుడ్ సెలబ్రిటీ సన్ని లియోనీ హాజరు కావాల్సిన ఓ ఫ్యాషన్​ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనతో ఆ ఫ్యాషన్​ షో అర్ధాంతరంగా ఆగిపోయింది. మణిపుర్​ రాజధాని ఇంఫాల్ నగరంలో ఈ ఘటన జరిగింది. శనివారం ఉదయం 6.30 గంటలకు పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో నగరంలోని ప్రజలు ఒక్కసారిగా భయందోళనలనకు గురయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హప్తా కాంగ్జేబుంగ్ ప్రాంతంలో జరుగుతున్న ఫ్యాషన్​ షో ప్రాంగణానికి 100 మీటర్ల దూరంలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎవ్వరికి గాయాలు కాలేదని ఇంఫాల్ ఈస్ట్​ ఎస్పీ మహారాబం ప్రదీప్ సింగ్ తెలిపారు. పేలుడుకు చైనీస్​ గ్రెనేడ్​ను వినియోగించినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ పేలుడుకు సంబంధించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదని ప్రదీప్ సింగ్ వెల్లడించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news