కేంద్రానికి వత్తాసు పలికేలా రఘునందన్‌ వ్యాఖ్యలు.. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్

-

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగిసింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆ చర్చకు సమాధానం ఇస్తున్నారు. అంతకుముందు మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలు కేంద్రానికి వత్తాసు పలికేలా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు.. సద్విమర్శలు చేయొచ్చు కానీ.. రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

‘దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉంది. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచిలా మారింది. తెలంగాణలో ఏ రంగాన్ని కూడా విస్మరించకుండా అభివృద్ధి చేస్తున్నాం. తెలంగాణ… దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగింది. రైతులకు సలాం చెబుతున్నాను. కరోనా సమయంలో పనిచేసిన వైద్య సిబ్బందికి సలాం. తెలంగాణలో కరెంట్‌ కష్టం లేదు.. తాగునీటి తిప్పులు లేవు. సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తిరుగులేదు. దేశ ప్రజల చూపు కేసీఆర్‌ వైపు ఉంటుంది. రాష్ట్రంలో నిధుల వరద పారుతోంది.. నియమాకాల కల సాకరం అవుతోంది.’ అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news