మరోసారి విస్తారా విమానానికి బాంబు బెదిరింపు..

-

మరోసారి విస్తారా ఎయిర్ లైన్స్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. కేవలం ఒక్క ఎయిర్ పోర్టులు, విమానాలకే కాకుండా ఈ మధ్యకాలంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు అనే తేడా లేకుండా కొందరు ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ ప్యాసింజర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.పగలు,రాత్రి అనే తేడా లేకుండా బెదిరింపులకు గురిచేస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 4 రోజుల వ్యవధిలో ఆగంతకులు ఇలా 35 నకిలీ కాల్స్ చేశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా,ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్ వెళ్లేందుకు విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బయలుదేరింది.టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్‌లో బాంబులు పెట్టినట్లుగా ఓ ఆగంతకుడి నుంచి ఎయిర్‌పోర్టు సిబ్బందికి బెదిరింపు కాల్ వచ్చింది.దీంతో వెంటనే ఫ్లైట్ సిబ్బందికి సమాచారం అందజేయడంతో విమానాన్ని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌‌కు దారి మళ్లించారు.అక్కడ భద్రతా ఏజెన్సీ నుంచి పూర్తి అనుమతులు వచ్చాకే విమానం బయలుదేరనున్నట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news