కర్ణాటక మొదటి బడ్జెట్ పై… బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు !

-

కర్ణాటకలో ఈ మధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి అధికారాన్ని ఏర్పాటు చేసింది. గతంలో సీఎంగా చేసిన సిద్దరామయ్యనే అధిష్టానం ఎంచుకుంది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి తాజాగా సిద్దరామయ్య రాష్ట్ర బడ్జెట్ ను విధానసభలో ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్ ను సిద్దరామయ్య రూ. 3 .27 లక్షల కోట్లతో కర్ణాటక 14వ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పై ప్రతిపక్ష నేత బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశాడు. బొమ్మై మాట్లాడుతూ… ఇదొక రివర్స్ గేర్ బడ్జెట్ అంటూ ఒక్క దెబ్బతో తీసిపారేశారు. సీఎం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏమాత్రం కొత్తదనం లేదంటూ విమర్శలు చేశాడు. ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాదంలో నడిపిస్తుందని ఏమాత్రం అనుకోవడం లేదు అన్నారు.

ఈ బడ్జెట్ కారణంగా రాబోయే రోజుల్లో రాష్ట్రము ఆర్ధికంగా మరిన్ని నష్టాలను ఎదుర్కొంటూనే ప్రమాదం ఉందన్నారు బొమ్మై. మరి మాజీ సీఎం బొమ్మై చేసిన వ్యాఖ్యలపైన ప్రభుత్వం నుండి ఎవరైనా స్పందించి ఖండిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version