తెలంగాణలో కరెంట్‌ బిల్‌ కట్టకపోవడంపై స్పందించిన బొత్స

-

హైదరాబాద్ లో కరెంటు సరిగా ఉండదని… జనరేటర్ వేసుకొని ఉండి వచ్చానని రెండు రోజుల కిందట ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చే నేపథ్యంలో.. ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్య నారాయణ. అయితే.. ఈ నేపథ్యంలోనే… తెలంగాణ విద్యుత్ శాఖ ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా బొత్స కౌంటర్‌ ఇచ్చారు .

“మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. మీరు కరెంటు బిల్లు క్లియర్ చేసిన వెంటనే మీ ఇంటికి కరెంటు సరఫరా చేస్తాం. 15 నెలలుగా మీరు బిల్లు చెల్లించలేదు. అందుకే కరెంట్ కట్ చేశాము”అంటూ బొత్స సత్యనారాయణకు ట్విట్టర్ వేదికగా విద్యుత్ శాఖ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. వాస్తవానికి తెలంగాణ విద్యుత్‌ శాఖ ఆ ట్వీట్‌ చేయలేదు. ఫేక్‌ ఐడీతో.. ఈ ట్వీట్‌ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇదంతా తప్పుడు ప్రచారమని.. తాను కరెంట్‌ బిల్‌ కట్టానని.. ఫ్రూప్స్‌ చూపించారు బొత్స. దీంతోనైనా ఈ వివాదానికి తెరపడుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news