దారుణం : మహబూబాబాద్ లో కిడ్నాప్ చేసిన బాబుని చంపేశారు !

-

మహబూబాబాద్ లో కిడ్నాప్ అయిన బాలుడి కేసు విషాదాంతం అయింది. ఆ బాబుని చంపేశారు కిడ్నాపర్లు. నిజానికి నాలుగు రోజుల క్రితం ఆ బాబుని కిడ్నాప్ చేసి తిరిగి అప్పచెప్పాలి అంటే 45 లక్షలు ఇవ్వాలి అని కిడ్నాపర్ లు డిమాండ్ చేసారు. ఆ తర్వాత నుంచి టెక్నాలజీ వాడుతూ కాల్స్ చేస్తూ తల్లి తండ్రులను బెదిరించారు. అయితే తమకు డబ్బు ముఖ్యం కాదని 45 లక్షలు ఇవ్వడానికి కూడా ఆ బాలుడి తల్లి తండ్రులు అంగీకరించారు.

అయినా సరే కిడ్నాప్ వాళ్ళు కనికరించలేదు. నిజానికి ఈ రోజు ఉదయం బాలుడి కిడ్నాప్ సుఖాంతం అయింది అని అందరూ భావించారు. మీడియాలో కూడా ఆ మేరకు కధనాలు వచ్చాయి. పోలీసులు 11 గంటలకు మీడియా ముందు బాలుడ్ని చూపించే అవకాశం ఉందని పేర్కొన్నా చివరికి బాబుని చంపేసినట్టు గుర్తించారు. ఈ కేసులో పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నారు. బాలుడి కుటుంబానికి సమీప బంధువులే ఈ పనికి పాల్పడ్డారని తెలుస్తోంది. నిందితుడు సమీప బంధువులు మనోజ్ రెడ్డి, సాగర్ అని అంటున్నారు. బాబుకు మత్తు గోలీలు అధిక మోతాదులో ఇవ్వడంతో చనిపోయినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news