బ్రేకింగ్:ఒక్క రోజే 55 వేల కేసులు…!

-

దేశంలో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు పెరగడమే గాని తగ్గే సూచనలు లేవు. గత 24 గంటల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 55,079 పాజిటివ్ కేసులు & 779 మరణాలు నమోదు అయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 16 లక్షలను దాటింది. దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 5,45,318గా ఉన్నాయి.

coronavirus

కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 10,57,806 గా ఉంది. మరణాలు కూడా భారీగా నమోదు అవుతున్నాయి. 35,747 మంది దేశంలో కరోనాతో మరణించారు. మొత్తం కేసులు 16,38,871 గా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాదాపు దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అయితే ఇకవారీ రేటు 64 శాతం కి చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version