బ్రేకింగ్ :మంత్రి అంబటి రాంబాబుకు తప్పిన ప్రమాదం!

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుకు కాసేపటి క్రితం పెను ముప్పు తప్పింది. తెలుస్తున్న పూర్తి వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద తన కాన్వాయ్ లో వెళుతున్న మంత్రి అంబటి రాంబాబు కారు మీద రెండు గోధుమ బస్తాలు సడెన్ గా పడ్డాయి. అయితే కాన్వాయ్ పక్కనే వెళుతున్న గోధుమలా బస్తాల లోడ్ లారీ నుండి పడడంతో ఒక్కసారిగా అందరూ అలెర్ట్ అయ్యారు. ఈ కారు బానెట్ పైన పడిన బస్తాలు వలన కారు ముందు భాగం కొంచెం దెబ్బ తిన్నది. బస్తాలతో వెళుతున్న లారీ తాడు సడెన్ గా ఓడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ ఘటనతో షాక్ అయిన మంత్రి అంబటి రాంబాబు వెంటనే వేరే కారులో అక్కడి నుండి వెళ్లిపోయారు.

ఈ ఘటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. కాగా ఇలాంటివి జరగడం సర్వ సాధారణం.. కానీ అదృష్టవశాత్తూ ఏమీ జరగలేదు..

Read more RELATED
Recommended to you

Latest news