బ్రేకింగ్: ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జ్

-

కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలు రావడంతో ఆయనను ఆగస్టు 18 న ఆయనను ఎయిమ్స్ లో చేర్చారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించింది అనే ప్రచారం చేసారు. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. ఆయన ఆరోగ్యం విషమించింది అనే వార్తలు బిజెపి నేతలను ఆందోళనకు గురి చేసాయి.

కేంద్ర మంత్రులు చాలా మంది కరోనా బారిన పడిన సంగతి విదితమే. దాదాపు 15 మంది కేంద్ర మంత్రులకు కరోన వైరస్ సోకింది. వారిలో చాలా మంది కరోనా నుంచి బయటపడ్డారు. పలు రాష్ట్రాల బిజెపి నేతలు కూడా కరోనా బారిన పడ్డారు. అలాగే బిజెపి పాలిత రాష్ట్రాల్లో పలువురు మంత్రులు కూడా కరోనా బారిన పడి ఇబ్బందులు పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news