BREAKING :ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు

-

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి కోసం ఆయన ఈ ఉదయం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే సాయంత్రం మరో నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవం అయింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయ్యపాత్రుడు నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన అయ్యన్నపాత్రుడు మంత్రి, ఎంపీగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయనకు స్పీకర్‌గా అవకాశం దక్కింది. దీంతో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ….సీనియర్ నేతగా చాలా పదవులు అనుభవించానని, ఇప్పుడు స్పీకర్‌గా ప్రజలకు మరింత సేవ చేస్తానని తెలిపారు. ఇక తమ నాయకుడు సభాపతిగా ఎన్నికవ్వడంతో అయ్యన్నపాత్రుడి అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news