సౌత్ ఆఫ్రికాలో పర్యటించనున్న భారత్.. షెడ్యూల్ ఇదే !

-

ప్రస్తుతం టీమిండియా టి 20 ప్రపంచకప్ 2024 లో బిజీగా ఉంది. ఇకపోతే టీమిండియా ఈ ఏడాది నవంబర్‌లో భారత్ సౌత్ ఆఫ్రికాలో పర్యటించనుంది.ఈ పర్యటనలో భాగంగా 4 మ్యాచ్‌ ల టీ20 సిరీస్ భారత్ ఆడనుంది. ఈ ప్రక్రియ కోసం సౌత్ ఆఫ్రికా బోర్డు అప్పుడే ఓ షెడ్యూల్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా నవంబర్ 8 నుండి 15 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. బీసీసీఐ 2024 – 25 సీజన్ కోసం ఇండియా హోమ్ షెడ్యూల్‌ ను ప్రకటించిన తర్వాత, సౌత్ ఆఫ్రికా తాజా షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది.

 

ఇక గత సంవత్సరం ఇండియా దక్షిణాఫ్రికాలో పర్యటించిన సమయంలో.. టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌ లలో భాగమైంది. వన్డే సిరీస్‌ ను ఇండియా 2 – 1తో కైవసం చేసుకుంది. ఇక టెస్టు, టీ20 సిరీస్‌ లలో ఇరు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి.

 

సౌత్ ఆఫ్రికా తో ఇండియా తలపడే షెడ్యూల్ :

 

 

* మొదటి టీ20 డర్బన్ వేదిక – నవంబర్ 8

* రెండో టీ20 గబేహా గ్రౌండ్ – నవంబర్ 10

* మూడో టీ20 సెంచూరియన్ ఎరీనా వేదిక-నవంబర్ 13

* నాలుగో టీ20 జోహన్నెస్‌బర్గ్ వేదిక – 15 నవంబర్

 

Read more RELATED
Recommended to you

Latest news