బ్రేకింగ్: మేము ఆత్మహత్య చేసుకుంటామని గవర్నర్, హైకోర్ట్ కి ఫ్యామిలీ లెటర్

-

మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్, హైకోర్టుకు వేటపాలెం మండలం రామచంద్రపురం గ్రామస్తుడు కోడూరి వెంకటేశ్వర్లు అర్జీ పెట్టుకున్న ఘటన ఏపీలో హాట్ టాపిక్ అయింది. గత ఏడాది కాలంగా తమ కుటుంబాన్ని గ్రామం నుండి వెలివేసి వేధింపులకు గురిచేస్తున్నా అధికారులు పెట్టించుకోవటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ లెటర్ రాసారు.

charted accountant suicide and murder mystery

ఇప్పటికే ఓసారి ఆత్మహత్యకు పాల్పడి పోలీసులు కేసు నమోదు చేయటంతో కోర్టుల చుట్టూ తిరగలేక పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ అండతో ఆయన వర్గీయుల వేధింపులు తాళలేక పోతున్నామంటూ ఆరోపణలు చేసారు. చీరాలలో ఆమంచి వర్సెస్ కరణం వర్గీయులుగా పరిస్థితి మారింది. ఈ క్రమంలోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు దృష్టికి కూడా తీసుకుని వెళ్ళారు.

Read more RELATED
Recommended to you

Latest news