BREAKING : తెలంగాణలో మరో కొత్త పార్టీ ..!

-

తెలంగాణ లో మరొకొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుడుతున్నారు. డాక్టర్ వినయ్ నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్ బంజారా ఫంక్షన్ హాల్ లో తన మద్దతుదారులతో డాక్టర్ వినయ్ ఈ మేరకు భేటీ అయ్యారు. సాధించుకున్న తెలంగాణ లో అందరికీ న్యాయం జరగాలనే డిమాండ్ తో కొత్తపార్టీ పెడుతున్నట్టు వినయ్ ప్రకటించారు. డాక్టర్ వినయ్ తండ్రి శివశంకర్ గతం లో కేంద్రమంత్రి గా పనిచేశారు.

డిసెంబర్ లో కొత్త పార్టీ పేరు ను డాక్టర్ వినయ్ కుమార్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వినయ్ కొత్త పార్టీ వైపు అడుగులు వేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ లో ఉన్న పార్టీ లతో పొలిటికల్ హీట్ పెరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా షర్మిల కూడా ఓ పార్టీని స్థాపించగా…ఇటీవలే మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఓ పార్టీని స్థాపించారు. రాష్ట్రం లో ఇప్పుడు మరో పార్టీ స్థాపించడం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news