BREAKING NEWS: టీమిండియాకు కొత్త కెప్టెన్ ఎంపిక !

-

వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా ఆడిన తీరు పట్ల చాలా మంచి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇదంతా కూడా ఆటలో ఒక భాగమే..ఎవరైనా ఇంత పెద్ద టోర్నమెంట్ లో ఓడిపోవాలని కోరుకోరు. అయితే ఫైనల్ లో జరిగిన ఘోర పరాభవానికి బదులు తీసుకునే సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో ఇండియా వేదికగా ఆస్ట్రేలియా జట్టు అయిదు టీ 20 మ్యాచ్ ల సిరీస్ ను ఆడనుంది. ఈ సిరీస్ కు సీనియర్ ప్లేయర్స్ అందరూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సిరీస్ కు కొత్త కెప్టెన్ ను బీసీసీఐ ప్రకటించింది. ఈ రోజు అహమ్మదాబాద్ లో భేటీ అయిన సెలెక్టర్లు సూర్య కుమార్ యాదవ్ ను ఈ టీం ను లీడ్ చేయడానికి కెప్టెన్ గా ఎంపిక చేశారు.

కొందరు శ్రేయస్ గురించి కూడా ఆలోచించమని చెప్పినా, ఎందుకో చివరికి సూర్య వైపు మొగ్గు చూపారు. మరి ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా ను క్లీన్ స్వీప్ చేసి ఫైనల్ లో ఓటమికి బదులు తీర్చుకుంటారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news