బ్రేకింగ్: ఎస్పీ బాలుకి ప్లాస్మా

-

కరోనా బారిన పడిన వయసు పైబడిన వారు కోలుకోవడం అనేది ఇప్పుడు కాస్త సవాల్ గా మారింది. ముఖ్యంగా సినీ ప్రముఖుల్లో వయసు మీద పడిన వారికి చికిత్స అందించడం వైద్యులకు ఇబ్బందిగా మారింది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఇప్పుడు విషమం అయింది. ఆయన కరోనా లక్షలతో ఆస్పత్రిలో చేరగా కరోనా పాజిటివ్ వచ్చింది. మొన్నటి వరకు నిలకడగా ఉన్న ఆయన ఆరోగ్యం, విషమంగా అకస్మాత్తుగా మారడంతో ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు వెంటిలేటర్ పై ఆయనను ఉంచి చికిత్స అందించారు.

రెండు రోజుల నుంచి ఆయన వెంటిలేటర్ మీద ఉండే వైద్యం తీసుకుంటున్నారు. ఆయనకు కరోనా కాస్త తీవ్రంగా మారడంతో ఇప్పుడు ప్లాస్మా చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయానికి వచ్చారు. ఇటీవల ప్లాస్మా నుంచి చాలా మంది ప్రముఖులు కోలుకున్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి కూడా ప్లాస్మా నుంచే కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news