BREAKING: వరల్డ్ కప్ లో విద్వంసాన్ని సృష్టించడానికి ఉగ్రవాదుల కుట్ర !

-

అక్టోబర్ 5వ తేదీ నుండి ఇండియా వేదికగా వరల్డ్ కప్ జరుగనున్న విషయం తెలిసిందే. కాగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఒక ప్రమాదకర వార్త వైరల్ అవుతోంది. వరల్డ్ కప్ పై ఉగ్రవాదుల కన్ను పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా కూడా కెనడా లో ఖలిస్థాన్ నాయకుడు నిజ్జర్ హత్యకు ప్రతీకారంగానే అని తెలుస్తోంది. ఇప్పటికే కెనడా నుండి కొంతమంది ఖలిస్థాన్ మద్దతుదారులు ఇండియా కు వచ్చారట. ఇక ఈ వరల్డ్ కప్ ను వరల్డ్ టెర్రర్ కప్ గా మారుస్తామంటూ సిక్స్ ఫర్ జస్టిస్ అధినేత మరియు ఉగ్రవాది గురూపత్వంత్ సింగ్ సీరియస్ గా చెప్పారట. ఈ విషయం తెలిసిన గుజరాత్ పోలీసులు అప్రమత్తం అయ్యి ఉగ్రవాది పన్నూ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.

మరి ఈ విషయాన్నీ ఇండియా గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుని ముందస్తుగా జాగ్రత్త చర్యలను తీసుకుంటుందా ? ముందు ముందు ఉగ్రవాద గ్రూప్ ల నుండి ఏమి సమాచారం రానుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news