తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో మరిన్ని కొత్త పథకాలు..!

-

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరిన్ని కొత్త పథకాలు తీసుకురానున్నట్టు వాటిపై సీఎం కేసీఆర్ త్వరలోనే ఓ ప్రకటన చేస్తారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో పై సీఎం కసరత్తు చేస్తున్నారని తెలిపారు.  సీఎం కేసీఆర్ త్వ‌ర‌లోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుద‌ల చేయ‌బోతున్నార‌ని, అన్ని వ‌ర్గాలు సంతోష‌ప‌డేలా శుభ‌వార్త ఉంటుంద‌ని తెలిపారు.

 

కాంగ్రెస్, బీజేపీకి దిమ్మతిరిగిపోయే బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని.. త్వరలోనే అన్ని వర్గాల వారు శుభవార్త వింటారు అని తెలిపారు. మూడో సారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు మంత్రి హరీశ్ రావు. ఇప్పటికే కేసీఆర్ చెప్పిన ప్రతిమాట చేసి చూపించారని.. ఉచిత కరెంట్, ఎకరానికి రైతుబంధు రూ.5వేలు ఇస్తా అన్నాడు. ఫింఛన్, ఆడ పిల్ల పెళ్లికి రూ.1లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మీ, బిడ్డ డెలివరీకి వెళ్లితే.. కేసీఆర్ కిట్, డెలివరీ అయిన తరువాత 12, 13 వేలు అందిస్తున్నాడు. అదేవిధంగా ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నాడని పలు అభివృద్ధి పనుల గురించి వివరించారు. 

Read more RELATED
Recommended to you

Latest news