పవన్ కళ్యాణ్”బ్రో” మూవీ నుండి కిరాక్ అప్డేట్

-

పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లు నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్రో… ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమా తమిళ్ లో హిట్ అయిన వినోధయ సీతం కు రీమేక్ అని తెలిసిందే. ఈ సినిమాను విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వునేనభుందు లేటెస్ట్ గా అద్భుతమైన అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా టీజర్ ను రేపు సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనుంది. దీనితో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. కాగా ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కూడా పెన్ సాయం చేస్తున్నారు. మరి ఈ సినిమా నుండి రానున్న టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా తెలియాలంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే.

కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయాలతో పిచ్చ బిజీ గా ఉన్నారు. గోదావరి జిల్లాలో వారాహి యాత్రను చేస్తూ బిజీ గా ఉన్నారు. మరి వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉండడంతో సినిమాను ఏ విధంగా పూర్తి చేస్తారు చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news