ఏపీలో దారుణం : దోశ కు డబ్బులు ఇవ్వలేదని బీటెక్ విద్యార్థి సుసైడ్ !

-

ప్రస్తుత కాలంలో యువతి… క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా… సుసైడ్‌ తనకు శరణ్యమంటూ… ఆవేశం గా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యం లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే… తాజాగా తిరుపతిలో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. ఓ బీటెక్‌ విద్యార్థి ఇంట్లో డబ్బులు ఇవ్వలేదని ఆత్మ హత్య చేసుకోవడం కలకలం రేపింది.

కోడి గుడ్డు దోశ కోసం డబ్బు ఇవ్వ లేదని అలిగి ఆత్మహత్య చేసుకున్నాడు బీటెక్ విద్యార్థి సాయి కిరణ్. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ తలారి వారిపల్లి లో ఈ ఘటన చోటు చేసుకుంది.

తల్లి దండ్రులు దోశ తినేందుకు డబ్బులు ఇవ్వక పోవడం తో గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు బీటెక్‌ విద్యార్థి సాయి కిరణ్. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు గుర్రప్పకుంట లో దూకి… సాయి కిరణ్‌ మృత దేహాన్ని బయటకు తీశారు. ఇక ఈ విషయం తెలిసిన… స్థానిక పోలీసులు… ఘటన స్థలానికి వచ్చారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news