Karnataka : ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలిపై యువకుడి మూత్ర విసర్జన

-

ఇటీవల విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఉదంతం మరిచిపోక ముందే కర్ణాటకలోనూ అలాంటి ఘటన చోటుచేసుకుంది. కాకపోతే ఇక్కడ విమానం కాదు ఆర్టీసీ బస్సు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విజయపుర నుంచి మంగళూరుకు వెళుతున్న కేఎస్‌ఆర్టీసీˆ బస్సు హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరులో ఒక దాబా వద్ద మంగళవారం అర్ధరాత్రి ఆగింది. ఎక్కువ మంది ప్రయాణికులు బస్సు దిగి టీ తాగేందుకు వెళ్లారు. బస్సు ముందు వరుసలో నిద్రిస్తున్న ఉన్న మహిళపై వెనక సీట్లో నుంచి వచ్చిన రామప్ప(25) మూత్రం పోశాడు. గాఢనిద్రలో ఉన్న ఆమె తుళ్లిపడి మేలుకుని కేకలు పెట్టారు.

బస్సులోని మిగిలిన ప్రయాణికులు, బయట ఉన్న డ్రైవరు, కండక్టరు అక్కడికి పరుగున వచ్చారు. నిందితుడిని దూషించి, బస్సు నుంచి కిందికి దించేశారు. అతని సామగ్రిని బయట పడేశారు. ఒకరిద్దరు ప్రయాణికులు రామప్పపై చేయి చేసుకున్నారు. మహిళను ఓదార్చారు. ఆమె దాబాలోని స్నానాల గదిలో స్నానం చేసి, దుస్తులు మార్చుకునే వరకు బస్సును ఆపారు. నిందితుడు మద్యం మత్తులో ఉండి ఇలా చేశాడని భావించారు. మహిళ విన్నపం మేరకు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కండక్టర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version