వైసీపీ చీకటి పొత్తుల సంగతేంటి : బుద్ధా వెంకన్న

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న పొత్తులపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా.. టీడీపీ అధినేత కూడా పొత్తులకు సిద్దమన్నట్లుగానే సంకేతాలు ఇచ్చారు.. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు జనసేన, టీడీపీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో.. తమ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు పొత్తుల గురించి మాట్లాడితే వైసీపీ ఉలిక్కిప‌డుతోంద‌ని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.

టీడీపీ పొత్తు ఎప్ప‌టికైనా బ‌హిరంగంగానే జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు బుద్ధా వెంకన్న. టీడీపీ పొత్తులు అభ్యంత‌ర‌మైతే.. వైసీపీ తెర వెనుక అనైతిక, అస‌హ్య‌క‌ర చీక‌టి పొత్తుల సంగ‌తేంట‌ని ప్ర‌శ్నించారు బుద్ధా వెంకన్న. తెలంగాణ నుంచి మూట‌లు, జాతీయ‌పార్టీల ఆశీస్సులు, పెద్దిరెడ్డి టూరిస్టు ఓట‌ర్లు, ప్ర‌శాంత్ కిశోర్ పేటీఎం బ్యాచులు, పింక్ డైమండ్ నాట‌కం, కోడిక‌త్తి డ్రామా, బాబాయ్ గుండె పోటు, ప్ర‌జాస్వామ్య ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌కే చీడ‌పురుగులాంటిది వైసీపీ అంటూ వెంక‌న్న మండిప‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version