ఆగస్టు 22 నుంచి బాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌.. పీవీ సింధు దూరం

-

ఆగస్టు 22 టోక్యోలో జరగనున్న బాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు స్వర్ణ పతకాలు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో షట్లర్లు అద్భుతంగా రాణించి ఆరు పతకాలను కైవసం చేసుకున్నారు. మూడు బంగారు పతకాలు, రెండు కాంస్యాలు, రజత పతకాలను కైవసం చేసుకున్నారు భారత షట్లర్లు. పీవీ సింధు, లక్ష్య సేన్ మరియు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి జంట వారి వారి ఈవెంట్‌లలో స్వర్ణం సాధించగా, కిడాంబి శ్రీకాంత్ మరియు ట్రీసా జాలీ మరియు గాయత్రీ గోపీచంద్ జంట కాంస్యం సాధించారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు రజత పతకం సాధించింది.

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరపున 26 మంది బృందం పాల్గొంటుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ 12 పతకాలు సాధించింది, అయితే 2019లో పీవీ సింధు ద్వారా మాత్రమే స్వర్ణం వచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ 2022 నుండి పీవీ సింధు మినహా మిగతా పతక విజేతలందరూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొంటారు. సింధు ఎడమ పాదానికి గాయం కావడంతో వైదొలగాల్సి వచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version