నెలకు రూ.5 వేలని పొదుపు చేస్తే రెండు లక్షలు వస్తాయి..!

-

చాలా మంది నచ్చిన వాటిలో డబ్బులని పెట్టాలని చూస్తూ వుంటారు. దీని వలన భవిష్యత్తు లో ఇబ్బందులేమీ వుండవు. మీరు కూడా ఏదైనా స్కీమ్ లో డబ్బులని పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే ఈ స్కీమ్ కోసం చూడాలి. ఇలా చేస్తే రిటైర్మెంట్ సేవింగ్స్‌తో పాటు నెల నెలా పెన్షన్ రూపంలోనూ పెద్ద మొత్తంలో అందుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో డబ్బులని పెడితే చక్కగా డబ్బులు వస్తాయి.

రిటైర్ అయ్యిన తర్వాత కూడా నెల నెలా రూ. 2 లక్షలు వచ్చేలా ప్రభుత్వం రూపొందించిన వ్యవస్థ ఇది. ఈ స్కీమ్ లో డబ్బులని పెడితే మంచి రాబడి వస్తుంది. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడం మంచిదే ప్రభుత్వ గ్యారంటీ కూడా ఉంటుంది. ఇన్‌కంటాక్స్ సెక్షన్ 80C ప్రకారం అత్యధికంగా రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ సేవింగ్ ని కూడా ఈ స్కీమ్ ఇస్తోంది.

ఇక ఈ స్కీమ్ తో ఎంత డబ్బులు వస్తాయి అనేది చూస్తే… 40 సంవత్సరాల వరకు నెలనెలా రూ.5000 చొప్పున డిపాజిట్ చేస్తే అరవై తరవాత అనగా రిటైర్మెంట్ సమయంలో రూ.1.91 కోట్లు ని మీరు పొందొచ్చు. దీనిని మెచ్యూరిటీ అమౌంట్ అంటారు. మెచ్యూరిటీ అమౌంట్ పెట్టుబడిపై నెలకు రూ.2 లక్షల వరకు పెన్షన్ వస్తుంది. సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా నెలకు రూ.63 వేలు, మీ పెట్టుబడిలో రిటర్న్స్ ద్వారా రూ.1.43 లక్షలు వస్తాయి. నెల నెలా అదనంగా రూ.63,768 పెన్షన్‌గా పొందొచ్చు. మొత్తంగా ప్రతి నెలా రూ.2 లక్షలని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news