టీడీపీలో విషాదం.. సీనియర్ నేత మనవడు దుర్మరణం ?

-

తెలుగుదేశం పార్టీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్ననే ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత కరోనా కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈరోజు పార్టీలో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అయిన గోనుగుంట్ల జయమ్మ మనవడు కన్ను మూసాడు అన్న వార్త శ్రేణుల్లో విషాదాన్ని నింపింది. నిన్న కెనడాలో ప్రేమ పేరుతో మోసపోయానని భావించిన ప్రణయ్ అనే యువకుడు నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ యువకుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే జయమ్మ మనవడు అని తెలుస్తోంది.

tdp
tdp

జయమ్మ కుమార్తె వాణి కుమారుడే ఈ ప్రణయ్  అని చెబుతున్నారు. అయితే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ప్రణయ్ తల్లిదండ్రులు పుచ్చకాయ నారాయణస్వామి వాణి దంపతులు చెబుతున్నారు. ప్రేమ పేరుతో మోసం చేయడంతోనే తట్టుకోలేకపోయాడు అని వారు చెబుతున్నారు. అఖిల తల్లిదండ్రులు కూడా మోసం చేశారు… మరొకరికి ఇలాంటి కష్టం రాకూడదని వారు పేర్కొన్నారు. ఇలాంటి వారిని సమాజం నుంచి వెలివేయాలని కోరుతున్నారు. ఇక ప్రణయ్ ఆత్మహత్యతో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే జయమ్మ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news