ఇండియాలో కొత్తగా 2364 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంట ల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 2364 నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,29,563 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2582 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.89 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 10 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,303 కి చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 15,419 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,91,79,96,905 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 13,71,603 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,89,841 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version