ద‌స‌రా ఉత్స‌వాల్లోకి దూసుకొచ్చిన కారు..4గురు మృతి..!

-

చ‌త్తీస్ గ‌డ్ లో దారుణం చోటు చేసుకుంది. ద‌స‌రాపండుగ ఉత్స‌వాలు జరుగుతున్న వేళ ప్ర‌జ‌ల పైకి ఓ కారు దూసుకురావ‌డంతో న‌లుగురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న చ‌త్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామ‌స్థులు ద‌స‌రా పండుగ సంధ‌ర్భంగా అంతాక‌లిసి ఊరేగింపుగా త‌ర‌లివెళుతున్న‌ స‌మయంలో ఓ ఎస్ యూవీ వాహ‌నం ఒక్క‌సారిగా వెన‌క నుండి దూసుకువ‌చ్చింది. అయితే ఆ వాహనంలో గంజాయిని త‌ర‌లిస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. భారీగా వాహ‌నంలో గంజాయి ఉండ‌టంతో పోలీసులు ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించారు. దాంతో త‌ప్పించుకునే క్ర‌మంలో వాహ‌నాన్ని వేగంగా న‌డిపిన కారు డ్రైవ‌ర్ ఊరేగింపుపైకి కారుతో దూసుకెళ్లాడు. దాదాపుగా ఈ వాహ‌నం 24 మందిని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెంద‌గా 20 మంది గాయ‌ప‌డ్డారు. ఇక ఊరేగింపును వీడియో తీస్తుండ‌గా యాక్సిడెంట్ కూడా వీడియోలో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news