సాంబార్ టేస్టీగా లేద‌ని త‌ల్లీ, చెల్లిని చంపేశాడు..!

-

క్ష‌ణికావేశంలో ఏం చేస్తున్నారో కూడా ఆలోచించ‌రు. అలా క్ష‌ణికావేశంలో తీసుకున్న నిర్ణ‌యాలు దారుణంగా ఉంటాయి. చిన్న చిన్న గొడ‌వ‌ల‌కు కోప్ప‌డుతూ చివ‌రికి దారుణాల‌కు పాల్ప‌డుతుంటారు. అలాంటి ఘ‌ట‌నే తాజాగా క‌ర్ణాట‌క రాష్ట్రంలో చోటు చేసుకుంది. సాంబారు రుచిగా వండ‌లేద‌ని ఓ దుర్మార్గుడు క‌న్న‌త‌ల్లిని తోడ‌బుట్టిన చెల్లిని హ‌త‌మార్చాడు. వివ‌రాల్లోకి వెళితే….క‌ర్నాట‌క‌లోని ద‌క్షిణ క‌న్న‌డ జిల్లా సిద్దాపుర తాలూకా కొడ‌గోడులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంజునాథ్ అనే యువ‌కుడు మ‌ద్యానికి బానిస‌య్యాడు.

కాగా మంజునాథ్ ఈ నెల 15న సాయంత్రం మ‌ద్యం సేవించి ఇంటికి వ‌చ్చాడు. భోజ‌నం పెట్ట‌మ‌ని అడ‌గ్గా త‌ల్లి భోజ‌నం వ‌డ్డించింది. మంజునాథ్ త‌న‌కు వేసిన సాంబార్ రుచిగా లేద‌ని త‌ల్లితో గొడ‌వ‌ప‌డ‌టంతో సోద‌రి కూడా మ‌ద్య‌లో మంజునాథ్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దాంతో గొడ‌వ జ‌ర‌గ్గా త‌ల్లి పార్వ‌తి సోద‌రి ర‌మ్య‌ల‌ను నాటు తుపాకీతో కాల్చి చంపాడు. దాంతో ఇద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. స్థానికుల స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని నింధితున్ని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news