ఇండియాలో కొత్తగా 268 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు

-

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 268 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,77,915 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఇద్దరు కూడా చనిపోలేదు. దీంతో మొత్తం సంఖ్య 5,30,698 కు చేరిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,552 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 95 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 182 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,43,665 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.20 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక నిన్న ఒక్క రోజే 8,777 మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news