పెద్దపల్లిలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు.. !

-

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పై పోలీసు కేసు నమోదయ్యింది. గత నెల జూలై 11న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వెంకటేశ్వర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాయల్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో పాయల్ రాజ్ పుత్ తో పాటు షాపు యజమానులు నిబంధనలను ఉల్లంఘించారు. షాప్ ఓపెనింగ్ సమయంలో పాయల్ రాజ్ పుత్ తో పాటు షాప్ యజమాని అతని భార్య మాస్క్ ధరించకుండా ఉన్నందుకు కేసు నమోదు చేశారు.

పెద్దపల్లి పట్టణానికి చెందిన బాబ్జీ అనే వ్యక్తి పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాయల్ పై కేసు నమోదైంది. ఇదిలా ఉంటే పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాలో రొమాంటిక్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఇక ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టిివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news