సీఎం జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చిన సీబీఐ కోర్ట్‌..

-

అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు హైదరాబాదులోని సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. 5 ఛార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతోపాటు, సీబీఐ విచారణ ముగిసే వరకు ఈడీ విచారణను నిలిపివేయాలనే మరో పిటిషన్ ను కూడా తిరస్కరించింది. కాగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ వచ్చేవారానికి కోర్టు వాయిదా పడింది.

అయితే జగన్ తన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఏపీకి సీఎం అయిన తర్వాత అధికారిక, ఇతరాత్ర కార్యక్రమాల వల్ల తాను కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని గతవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో ఈ వారానికి జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయంపు ఇచ్చింది. దీని కోసం జగన్ ఆబ్సెంట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఏ-2 నిందితుడు విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మానప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణకు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news