దారుణం : కరోనా పేషంట్స్ పై పడ్డ ఫ్యాన్..!

-

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఏడవ అంతస్తులోని వార్డులో ఓ సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. దీంతో ఆ సమయంలో బెడ్ పై ఉన్న ఇద్దరు కరోనా రోగులకు స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తుంది. ఈ ఘటనతో తాము మరింత భయాందోళనలకు గురయ్యామని వారు వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరుగకుండా చర్యలు చేపట్టాలని రొగులు డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటన తన దృష్టికి రాలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news