“సర్కారు వారి పాట” లో కియారా అద్వాని ..సెంటిమెంట్ కోసమేనా ..?

-

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన 27 వ సినిమాని ప్రకటించాడు. మే 31 న టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి మహేష్ బాబు అధికారకంగా తన సినిమాని అనౌన్స్ చేశాడు. గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని జీ.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫాం లో ఉన్న థమన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నాడు.

 

ఇక సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన 24 గంటల్లో ముందెన్నడు లేని విధంగా సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ ని సాధించి రికార్డ్ సాధించింది. ఒక్క ఫస్ట్ లుక్ తోనే ఈ స్థాయి రికార్డ్ సాధించడంతో అప్పుడే ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన చిత్ర బృందం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నది కూడా కన్‌ఫర్మ్ చేశారు. కాని ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది సస్పెన్స్ లో ఉంచారు.

అయితే తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం భరత్ అనే నేను సినిమాతో మహేష్ బాబు సరసన నటించి టాలీవుడ్ కి పరిచయమైన కియారా అద్వాని హీరోయిన్ అని తెలుస్తుంది. భరత్ అనే నేను సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ కియారా కి ఓటేశాడట మహేష్ బాబు. ఇక సర్కారు వారి పాట లో కియారా అద్వాని నటిస్తున్న విషయాన్ని త్వరలోనే అధికారకంగా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని 2021 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పరశురాం ప్లాన్ చేస్తున్నాడట.

Read more RELATED
Recommended to you

Latest news