ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం సీరియస్

-

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంలో గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ అంశంపై కోర్టులో కూడా విచారణ జరుగుతుంది. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితులలో కర్నూలుకు తరలిస్తామని తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.

ఏపీ హైకోర్టు తరలింపు పై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉందని తెలిపింది. హైకోర్టును కర్నూలుకు తరలించాలని సీఎం జగన్ ప్రతిపాదించారు కానీ.. మూడు రాజధానుల పై సీఎం ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ లో ఉమ్మడి హైకోర్టు ఉన్న సంగతి తెలిసిందే. తర్వాత టిడిపి హయంలో ఏపీ హైకోర్టును అమరావతి వేదికగా ఏర్పాటు చేశారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో మూడు రాజధానుల అంశాన్ని ప్రతిపాదన తీసుకువచ్చింది. ఈ క్రమంలో విశాఖను పరిపాలన, కర్నూలు న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version