ఇంటింటికీ రూఫ్ టాప్ సోలార్ పవర్ కేంద్ర ప్రభుత్వ పథకం

-

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దాదాపు కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా కేంద్రం పేర్కొంది.ఈ పథకం కోసం 76వేల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ బిల్డింగ్‌లపై రూఫ్‌టాప్ సోలార్ పవర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇందులో భాగంగా లబ్ధిదారులు సౌర విద్యుత్‌ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా రూ.78వేలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు అకౌంట్లో కి జమ చేయనున్నారు. అలాగే,రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి కూడా భారీ రాయితీపై రుణాలు తీసుకోవచ్చు. ఫిబ్రవరి 13న ఈ పథకాన్ని ప్రధాని మోడీ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news