బీసీలను అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

కాంగ్రెస్ దళితులను బీసీలను ఏనాడు పట్టించుకోలేదు. 2014లో ఇచ్చిన మాటకు కేసీఆర్ ఈసారి అయినా కట్టుబడి ఉండాలి. దళితుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి. డిసెంబర్ 3 తరువాత బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తాం.. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసింది కాంగ్రెస్. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్ కి ఉందా ? అని ప్రశ్నించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు కేసీఆర్.

తన కుమారుడు సీఎం అవుతారని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆరు నెలలకొకసారి ముఖ్యమంత్రి మారతారని విమర్శించారు. రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని.. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కి ప్రజలు అవకాశం ఇవ్వరన్నారు. బొగ్గు నుంచి హెలికాప్టర్ల వరకు కాంగ్రెస్ కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలన్నారు. ప్రజలు బీజేపీకి అవకాశం ఇస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి అబద్దాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. మెడికల్ కళాశాలల కోసం వంద ఉత్తరాలు రాసినట్టు చెబుతున్న కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news