బ్రేకింగ్ : రేపు తెలంగాణకి కేంద్ర బృందం

-

హైదరాబాద్‌ లో భారీ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో హైదరాబాద్‌ వాసులు బెంబేలెత్తుతున్నారు. వర్షం, వరదల కారణంగా హైదరాబాద్‌ అతలాకుతలమయింది. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో రేపు తెలంగాణకి కేంద్ర బృందం రానుంది.

రేపు సాయంత్రం కేంద్ర బృందం హైదరాబాద్ కు రానుంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఈ సెంట్రల్ టీం పర్యటించనుంది. నష్టం తీవ్రతను ఈ కేంద్ర బృందం అంచనా వేయనుంది. ఈ 13వ తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో 5 వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు తెలంగాణా ప్రభుత్వం అంచనా వేసింది. తక్షణ సహాయం గా.1350 కోట్ల ను విడుదల చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కి కేంద్ర బృందం రానున్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news